పేద వైద్య విద్యార్థినికి జయలలిత ఆర్థిక సాయం

- July 17, 2016 , by Maagulf
పేద వైద్య విద్యార్థినికి జయలలిత ఆర్థిక సాయం

తిరుచ్చి జిల్లాకు చెందిన ఓ నిరుపేద వైద్య విద్యార్థిని చదువుకు ముఖ్యమంత్రి జయలలిత ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుచ్చి జిల్లా మేలకుళుమణి గ్రామానికి చెందిన ముత్తువీరన్‌, మలర్కొడి దంపతుల కుమార్తె బృందాదేవికి తిరువారూర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి తనను చదివించడం అసాధ్యమని, అందువల్ల తన చదువుకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు బృందాదేవి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన జయలలిత ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతో పాటు తొలి ఏడాది విద్యా ఫీజు, హాస్టల్‌ ఫీజు, పుస్తకాల ఫీజు నిమిత్తతం రూ.50 వేలు నగదును 'పురట్చి తలైవి అమ్మ బెస్ట్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌' ద్వారా అందించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com