పేద వైద్య విద్యార్థినికి జయలలిత ఆర్థిక సాయం
- July 17, 2016
తిరుచ్చి జిల్లాకు చెందిన ఓ నిరుపేద వైద్య విద్యార్థిని చదువుకు ముఖ్యమంత్రి జయలలిత ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుచ్చి జిల్లా మేలకుళుమణి గ్రామానికి చెందిన ముత్తువీరన్, మలర్కొడి దంపతుల కుమార్తె బృందాదేవికి తిరువారూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి తనను చదివించడం అసాధ్యమని, అందువల్ల తన చదువుకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు బృందాదేవి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన జయలలిత ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతో పాటు తొలి ఏడాది విద్యా ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాల ఫీజు నిమిత్తతం రూ.50 వేలు నగదును 'పురట్చి తలైవి అమ్మ బెస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా అందించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







