రేపే మెగా జాబ్ మేళా..
- August 28, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. అందులో భాగంగానే జిల్లాల వారీలా ఎప్పటికప్పుడు జాబ్ మేళాలు నిర్వహిస్తోంది. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి విజయనగరం జిల్లా భీమసింగి శ్రీ బాలాజీ జూనియర్ & డిగ్రీ కళాశాలలో ఆగస్టు 29వ తేదీ(రేపు)న మరో మెగా జాబ్ మేళా జరగనుంది. మొత్తం 17 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని దాదాపు 1,730 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. కాబట్టి, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. ఈ జాబ్ మేళా గురించి మరిన్ని వివరాల కోసం 9000102013 సంప్రదించాలని అధికారులు సూచించారు.
సంస్థ, ఖాళీల వివరాలు:
- ప్రీమియర్ సోలార్ 60 ఖాళీలు
- డిక్సన్ 210 ఖాళీలు
- ఫాక్స్కాన్ రైజింగ్ స్టార్స్ మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
- ష్నైడర్ ఎలక్ట్రిక్ 120 ఖాళీలు
- టాటా ఎలక్ట్రానిక్స్ 70 ఖాళీలు
- ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ 30 ఖాళీలు
- నవతా ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 30 ఖాళీలు
- అపోలో ఫార్మసీ 40 ఖాళీలు
- జాబ్ డీలర్స్ 100 ఖాళీలు
- డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 150 ఖాళీలు
- ఔరోర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
- హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ 150 ఖాళీలు
- యోకోహామా టైర్స్ అచ్చుతాపురం – విశాఖ ట్రేడర్స్, అగనంపూడి 100 ఖాళీలు
- 24Q 200 ఖాళీలు
- కాన్సెంట్రిక్స్ డాక్ష్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 ఖాళీలు
- WNS 90 ఖాళీలు
- మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 80 ఖాళీలు
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









