విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- March 13, 2026
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరంలో అమలవుతున్న మురుగునీటి మరియు సెప్టేజ్ నిర్వహణ ప్రాజెక్టు పురోగతిపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు.గురువారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఈ ప్రాజెక్టు స్థితిగతులపై వివరణ కోరారు.
ఎంపీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు వ్రాతపూర్వక సమాధానం ఇచ్చారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, నీటి సరఫరా మరియు పారిశుధ్యానికి సంబంధించిన అంశాలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (AMRUT) మరియు AMRUT 2.0 వంటి పథకాల ద్వారా రాష్ట్రాలకు ఆర్థిక, సాంకేతిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రాజెక్టులను ఎంపిక చేసి అమలు చేసే అధికారం ఉందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AMRUT పథకం కింద ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి మరియు సెప్టేజ్ నిర్వహణ ప్రాజెక్టును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 2017 మే నెలలో ₹39.88 కోట్ల వ్యయంతో అనుమతి మంజూరు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని చెప్పారు.
అయితే కోవిడ్-19 మహమ్మారి ప్రభావం, సత్యనారాయణపురం ప్రాంతంలో సంప్ కమ్ పంప్ హౌస్ నిర్మాణంపై కోర్టు కేసు, గద్దె వెంకట్రామయ్య నగర్లో మరో సంప్ కమ్ పంప్ హౌస్ నిర్మాణంపై స్థానికుల అభ్యంతరాలు, అలాగే అదనపు పనుల కారణంగా ప్రాజెక్ట్ అసలు పరిధిలో మార్పులు రావడం వంటి కారణాలతో పనులు ఆలస్యమయ్యాయని వివరించారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ 98 శాతం భౌతికంగా పూర్తయిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 47.60 కిలోమీటర్ల మురుగునీటి పైపులైన్ల నెట్వర్క్ నిర్మాణం పూర్తయింది. అలాగే APIIC కాలనీ, ఆటో నగర్, సత్యనారాయణపురం, గద్దె వెంకట్రామయ్య నగర్ ప్రాంతాల్లో మూడు సంప్ కమ్ పంప్ హౌస్లు నిర్మాణం పూర్తయ్యాయి. సేకరించిన మురుగునీటిని ప్రస్తుత శుద్ధి కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు.
అదేవిధంగా 9,257 హౌస్ సర్వీస్ కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ ప్రాజెక్టును 2026 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఖర్చు పెరుగుదల లేదని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









