మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్

- March 13, 2026 , by Maagulf
మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్‌సైట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కార దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బాధితులు తమ ఫిర్యాదులను మరింత సులభంగా, పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు వీలుగా రాబోయే రెండు, మూడు వారాల్లోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్‌ సున్‌వాయ్‌’ (ప్రజా విచారణ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆమె, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఫోన్‌ నంబరు, వాట్సాప్, మెయిల్‌ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్‌ సున్‌వాయ్‌’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com