మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- March 13, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కార దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బాధితులు తమ ఫిర్యాదులను మరింత సులభంగా, పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు వీలుగా రాబోయే రెండు, మూడు వారాల్లోనే ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్వాయ్’ (ప్రజా విచారణ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆమె, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఫోన్ నంబరు, వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్వాయ్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









