మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- March 13, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కార దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బాధితులు తమ ఫిర్యాదులను మరింత సులభంగా, పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు వీలుగా రాబోయే రెండు, మూడు వారాల్లోనే ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్వాయ్’ (ప్రజా విచారణ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆమె, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఫోన్ నంబరు, వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్వాయ్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









