మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- March 13, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల సమస్యల పరిష్కార దిశగా మరో అడుగు ముందుకు వేసింది. బాధితులు తమ ఫిర్యాదులను మరింత సులభంగా, పారదర్శకంగా నమోదు చేసుకునేందుకు వీలుగా రాబోయే రెండు, మూడు వారాల్లోనే ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్నట్లు కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్వాయ్’ (ప్రజా విచారణ) కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించిన ఆమె, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం కావాల్సిన సమస్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఫోన్ నంబరు, వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం నిర్వహించిన ‘జన్ సున్వాయ్’ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







