శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బుల్లెట్ల కలకలం..
- August 28, 2025
హైదరాబాద్: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం రేగింది. ఓ ప్రయాణికుడి నుంచి 8 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. సుఖ్దీప్ అనే ప్రయాణికుడి నుంచి 8 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి అమృత్సర్ వెళ్లేందుకు అతడు వచ్చాడు. అధికారులు చెక్ చేయగా బుల్లెట్స్ లభ్యమయ్యాయి. పట్టుబడ్డ నిందితుడిని పంజాబ్ వాసిగా గుర్తించారు.బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
ప్రయాణికుడి వద్ద బుల్లెట్స్ లభ్యం కావడం ఎయిర్ పోర్టులో కలకలం రేపింది. తోటి ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. సుఖ్ దీప్ ఎందుకు తన వెంట బుల్లెట్స్ తెచ్చుకున్నాడు? అతడికి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటితో అతడికి ఏం పని? ఈ వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







