రూ.2,600 కోట్లతో విజయవాడ-బందరు రహదారి నిర్మాణం: మంత్రి రవీంద్ర
- August 30, 2025
విజయవాడ: ఆడబిడ్డలను ఆర్థికంగా బరోపేతం చేయడమే కూ టమి ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైనందుకు శుక్రవారం ఉదయం నగరంలోని టీటీడీ కల్యాణ మం డపంలో మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.తొలుత వ్యవహారిక భాష ఉద్యమ పితామహులు గిడుగు వెంకట రామమూర్తి పంతులుజయంతి సందర్భంగా వారి చిత్రపటానికి రాష్ట్ర మంత్రి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గిడుగు తెలుగు భాష అభివృద్ధికి చేసిన సేవలను వారు కొనియాడారు. మంత్రి తన ప్రసంగాన్ని కొన సాగిస్తూ ఆడబిడ్డల్లో చైతన్యం తెచ్చి, మహిళలకు పద్మావతి విశ్వవిద్యాలయం నెలకొల్పి, రిజర్వే షన్లు, ఆస్తి హక్కును కల్పించిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామా రావుకే దక్కుతుందన్నారు.
ఆడబిడ్డలను మరింత ముందుకు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కే దక్కుతుం దన్నారు. డ్వాక్రా సంఘాలను పెట్టడం, సాఫ్ట్వేర్ రంగంలో మహిళలకు ప్రోత్సహించి విదేశాలకు పంపడం, ఆడబిడ్డలు ఇబ్బంది పడకుండా దీపంపథకం కింద సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ల సరఫరా, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు., తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 68 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద రాష్ట్రంలో ఉన్న బస్సులలో 74 బస్సులను కేటాయించారని, చిన్న చిన్న పనులు చేసుకునే మహిళలు రూ.1500 నుంచి రూ.2000 నెలవారీ ఖర్చులు ఆదా కావాలని, ఆ డబ్బులు వేరే విధంగా ఉపయోగించుకోవాలన్నారు.
గతంలో మచిలీపట్నం-విజయవాడకు నాలుగు వరుసల జాతీయ రహదారిని నిర్మించేందుకు కృషి చేశామన్నారు. అలాగే నేడు మచిలీపట్నం-విజయవాడకు ఆరు వరుసల జాతీయ రహదారి నిర్మించేందుకు కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో మాట్లాడామన్నారు. రూ. 2600 కోట్ల వ్యయంతో ఆ రహదారి మంజూరు చేయడం జరిగిందన్నారు. మచిలీపట్నం నుండి రేపల్లె వరకు 45 కిలోమీటర్ల రైల్వే లైన్ పొడిగింపు కార్యరూపం దాల్చిందని, ఇందుకోసం 3 నెలల క్రితం కేంద్ర మంత్రితో మాట్లాడామని అన్ని ప్రయత్నాలు చేశామని 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందన్నారు.
ఈ రైల్వే లైన్ కోసం పోరాటం చేసిన బందరు నివాసి కొక్కిలిగడ్డ కోదండరామయ్య నేడు చనిపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందన్నారు. రాష్ట్రంలో 10,500 బస్సులు ఉండగా అందులో 75 8,500 బస్సులను మహిళల కోసం ఉచిత బస్సు పథకానికి కేటాయించామన్నారు. అనంతరం మహిళా లబ్ధిదారులకు మంత్రివర్యులు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి హరిహరనాథ్, ఆర్టిసి ఆర్ఎం వెంకటేశ్వర్లు, డిఎం పెద్దిరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్, కార్పొరేటర్లు అనిత, సమతాకీర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్లు గొర్రెపాటి గోపీచంద్, రొండి కృష్ణ, మున్సి పల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, మాజీ వైస్ చైర్మన్ కాశీ విశ్వనాథ్, పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్