అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- August 08, 2026
మస్కట్: ఒమాన్లోని ధోఫార్ గవర్నరేట్ పరిధిలో ఉన్న అల్ హల్లానియత్ దీవుల సమీపంలో "కరోలైన్ బెజెంగీ (CAROLINE BEZENGI)" అనే నౌక ఒడ్డుకు చేరి నిలిచిపోవడంతో, పర్యావరణంపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టినట్లు ఒమాన్ రవాణా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు పర్యావరణ అథారిటీ వెల్లడించాయి.
ప్రభుత్వంలోని సంబంధిత శాఖలతో సమన్వయంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, సముద్ర పర్యావరణం లేదా నౌకాయాన భద్రతకు ఎలాంటి ముప్పు తలెత్తినా అత్యవసర కార్యాచరణ ప్రణాళికల ప్రకారం వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలు సిద్ధంగా ఉన్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఉపగ్రహ చిత్రాలు, క్షేత్రస్థాయి సర్వేలు, సాంకేతిక నమూనాల ఆధారంగా పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ, ఎదురయ్యే సవాళ్లను గుర్తించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలు, చట్టాలు, ఒప్పందాలకు అనుగుణంగా అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన తాజా వివరాలను అధికారిక మార్గాల ద్వారానే వెల్లడిస్తామని, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన లులు చైర్మన్ యూసఫ్ అలీ
- కువైట్లో ఫ్యామిలీ విజిట్ వీసా నిబంధనల్లో మార్పులు..!!
- అల్ హల్లానియత్ దీవుల వద్ద నౌక ప్రమాదం..!!
- ఎనిమిదేళ్లుగా పెండింగ్లో మసీదుల నిర్మాణం.. నిరాశలో స్థానికులు..!!
- ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ను కొనుగోలు చేసిన సౌదీ నేతృత్వంలోని కన్సార్టియం..!!
- GCC పర్యాటకుల రాకతో ఖతార్ హాస్పిటాలిటీ రంగం వృద్ధి..!!
- అమెరికాలో లెట్యూస్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ .. యూఏఈలో ప్రభావంపై క్లారిటీ..!!
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!







