నేడు సిక్రింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు పునఃప్రారంభం
- September 09, 2025
హైదరాబాద్: సిక్రింద్రాబాద్ స్టేషన్లో రైల్వే సేవలు మళ్లీ యధావిధిగా అందుబాటులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లింపు, టెర్మినల్ మార్పులన్ని రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ నుంచి కాచిగూడ, విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12713/ 12 714) సికిందరాబాద్ నుండి బయలుదేరనున్నట్లు వివరించారు. కొన్ని ట్రైన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్ సెప్టెంబరు 9 నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే సేవలను ప్రారంభించిన ముంబయి నుంచి విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 18519/18520), విశాఖపట్నం నుంచి లింగంపల్లి, విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 12805/12806), చర్లపల్లి నుంచి మోలా అలీ సికింద్రాబాద్ మీదుగా తిరిగి వెళ్ళే రైళ్లలో కాజీపేట నుంచి హడప్సర్ వెళ్లే కాజీపేట ట్రెవీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17014/17013), కాకినాడ నుంచి పోర్ట్సయినగర్ వెళ్లే షిర్డీ,కాకినాడ పోర్ట్ ట్రెవీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17206/17205) సెప్టెంబరు 9 నుంచి సికిందరాబాద్ స్టేషన్ నుంచి రాక పోకలు సాగించనున్నాయి. మచిలీపట్నం నుంచి సాయినగర్కు వెళ్లే షిర్డీ మచిలీపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17208/17207), సెప్టెంబరు 12 నుంచి వాస్కోడ నుంచి గామాజా వెళ్లే వాస్కోడగామా వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలునం. 17321/17322) రాకపోకలు సాగిస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







