నేడు సిక్రింద్రాబాద్ నుంచి రైలు సర్వీసులు పునఃప్రారంభం
- September 09, 2025
హైదరాబాద్: సిక్రింద్రాబాద్ స్టేషన్లో రైల్వే సేవలు మళ్లీ యధావిధిగా అందుబాటులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనుల కారణంగా దారి మళ్లింపు, టెర్మినల్ మార్పులన్ని రైళ్లన్ని ఇకపై వాటి పాత మార్గాల్లోనే కార్యకలాపాలు కొనసాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే కాచిగూడలో తాత్కాలికంగా ఆగుతున్న విజయవాడ నుంచి కాచిగూడ, విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ (రైలు నెం. 12713/ 12 714) సికిందరాబాద్ నుండి బయలుదేరనున్నట్లు వివరించారు. కొన్ని ట్రైన్స్ ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని ట్రైన్స్ సెప్టెంబరు 9 నుంచి అందుబాటులోకి వస్తాయని పేర్కొంది.
సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే సేవలను ప్రారంభించిన ముంబయి నుంచి విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెం. 18519/18520), విశాఖపట్నం నుంచి లింగంపల్లి, విశాఖపట్నం డైలీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 12805/12806), చర్లపల్లి నుంచి మోలా అలీ సికింద్రాబాద్ మీదుగా తిరిగి వెళ్ళే రైళ్లలో కాజీపేట నుంచి హడప్సర్ వెళ్లే కాజీపేట ట్రెవీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17014/17013), కాకినాడ నుంచి పోర్ట్సయినగర్ వెళ్లే షిర్డీ,కాకినాడ పోర్ట్ ట్రెవీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17206/17205) సెప్టెంబరు 9 నుంచి సికిందరాబాద్ స్టేషన్ నుంచి రాక పోకలు సాగించనున్నాయి. మచిలీపట్నం నుంచి సాయినగర్కు వెళ్లే షిర్డీ మచిలీపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలు నం. 17208/17207), సెప్టెంబరు 12 నుంచి వాస్కోడ నుంచి గామాజా వెళ్లే వాస్కోడగామా వీక్లీ ఎక్స్ ప్రెస్ (రైలునం. 17321/17322) రాకపోకలు సాగిస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







