నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా..
- September 09, 2025
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా నిషేధంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ నిరసనలు తగ్గుముఖం పట్టలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయాలంటూ ఆ దేశంలోని యువత ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో రాజధానిలోని ఓలి అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతేకాదు.. ఇంటికి నిప్పుపెట్టారు.
ప్రధాని ఓలీ నివాసంతోపాటు సీనియర్ రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభంతోపాటు.. నిరసనల ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవికి తన రాజీనామాను ప్రకటించినట్లు తెలిసింది.
యువత నిరసనల నేపథ్యంలో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన నేపాల్ ఆర్మీ చీఫ్ ను అడిగినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









