నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా..
- September 09, 2025
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. నేపాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి దిగిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా నిషేధంపై ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముగ్గురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినప్పటికీ నిరసనలు తగ్గుముఖం పట్టలేదు. ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయాలంటూ ఆ దేశంలోని యువత ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ క్రమంలో రాజధానిలోని ఓలి అధికారిక నివాసాన్ని నిరసనకారులు ముట్టడించారు. ఇంట్లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అంతేకాదు.. ఇంటికి నిప్పుపెట్టారు.
ప్రధాని ఓలీ నివాసంతోపాటు సీనియర్ రాజకీయ నేతల ఇళ్లు, కార్యాలయాలను నిరసనకారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దీంతో నేపాల్ లో రాజకీయ సంక్షోభంతోపాటు.. నిరసనల ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, సైన్యం సూచన మేరకు ఆయన ప్రధాని పదవికి తన రాజీనామాను ప్రకటించినట్లు తెలిసింది.
యువత నిరసనల నేపథ్యంలో నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్ తో ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ క్లిష్ట పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు, ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా వెళ్లిపోయేందుకు మిలిటరీ సహాయం కావాలని ఆయన నేపాల్ ఆర్మీ చీఫ్ ను అడిగినట్లు తెలిసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







