కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- September 14, 2025
న్యూ ఢిల్లీ: ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టింది. సెప్టెంబర్ 22 నుండి కొత్త విధానం ప్రకారం, కేవలం 5% మరియు 18% జీఎస్టీ రేట్లు అమలులోకి వస్తాయి. దీనివల్ల టీవీలు, లగ్జరీ వస్తువులు మాత్రమే కాకుండా, చిన్న బిస్కెట్లు, చిప్స్, పేకెట్లు వంటి రోజువారీ వినియోగ వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
అయితే 5, 10, 20 రూపాయల చిప్స్, బిస్కెట్లు, నామ్కీన్, సబ్బులు, టూత్పేస్ట్ వంటి తక్కువ ధర ఉత్పత్తులపై ధరలు తగ్గుతాయా అనే సందేహం ఉన్నది. ఎఫ్ఎంసిజీ కంపెనీలు వెల్లడించగా, ఈ ఉత్పత్తుల ధరలను తగ్గించడం కష్టమని తెలిపారు. ఎందుకంటే, వినియోగదారులు ఈ స్థిరమైన తక్కువ ధరలకు అలవాటు పడినవారే, ధరను తగ్గించడం వల్ల గందరగోళం, అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు. దాంతో, కంపెనీలు ప్యాకెట్ పరిమాణాన్ని పెంచడం ద్వారా GST ప్రయోజనాలను వినియోగదారులకు అందజేస్తున్నాయి.
ప్యాకెట్ పరిమాణ పెంపు మరియు ప్రభుత్వ పర్యవేక్షణ
ఉదాహరణకు, రూ.20 బిస్కెట్ ప్యాక్ ధర స్థిరంగా ఉంచి, అందులోని ఉత్పత్తి పరిమాణాన్ని (Product size)పెంచుతున్నారు. ఈ మార్పు ద్వారా వినియోగదారులు ఎక్కువ విలువ పొందగలుగుతారు. అలాగే రోజువారీ ఉత్పత్తుల డిమాండ్ కూడా పెరుగుతుందని కంపెనీలు తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా వినియోగదారులు పూర్తి ప్రయోజనం పొందేలా కంపెనీల పర్యవేక్షణలో ఉంది మరియు మార్గదర్శకాలు జారీ చేసింది.
కొత్త GST రేట్లు ఏ తేదీ నుంచి అమలులోకి వస్తాయి?
సెప్టెంబర్ 22 నుంచి కొత్త 5% మరియు 18% రేట్లు అమలులోకి వస్తాయి.
చిన్న ధర ఉత్పత్తులపై GST తగ్గింపు ప్రభావం ఏమిటి?
5, 10, 20 రూపాయల బిస్కెట్లు, చిప్స్, సబ్బులు, టూత్పేస్ట్ వంటి ఉత్పత్తుల ధరలను తగ్గించడం కష్టమని కంపెనీలు పేర్కొన్నాయి; కానీ ప్యాకెట్ పరిమాణాన్ని పెంచడం ద్వారా ప్రయోజనం వినియోగదారులకు అందజేయబడుతుంది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!







