శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- September 18, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ఘనంగా జరగనున్నారు. ఈ విశిష్ట ఉత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం భక్తుల సౌకర్యం, భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశంలో వివరించినట్టు, భక్తుల పెద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ప్రధాన అంశమని పేర్కొన్నారు.
పాత అనుభవాల నుండి పొందిన పాఠాలను పరిగణలోకి తీసుకొని, ఈ సంవత్సరం భద్రతా ఏర్పాట్లలో మరింత పకడ్బందీతో పని జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా తిరుమల కొండ మరియు తిరుపతి నగరంలో భక్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా కేంద్రీకృతమైన భద్రతా దళాలను మోహరించడం జరిగింది. మొత్తం 4,000 మంది పోలీస్ సిబ్బందిని ఉత్సవాల కోసం మోహరించడం జరుగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో 3,000 మంది తిరుమల కొండ పై విధుల్లో ఉండగా, మిగిలిన 1,000 మంది తిరుపతి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







