శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- September 18, 2025
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వచ్చే నెల సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు ఘనంగా జరగనున్నారు. ఈ విశిష్ట ఉత్సవాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం భక్తుల సౌకర్యం, భద్రత కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మీడియా సమావేశంలో వివరించినట్టు, భక్తుల పెద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ప్రధాన అంశమని పేర్కొన్నారు.
పాత అనుభవాల నుండి పొందిన పాఠాలను పరిగణలోకి తీసుకొని, ఈ సంవత్సరం భద్రతా ఏర్పాట్లలో మరింత పకడ్బందీతో పని జరుగుతోంది. ఉత్సవాల సందర్భంగా తిరుమల కొండ మరియు తిరుపతి నగరంలో భక్తుల పరిరక్షణకు ప్రత్యేకంగా కేంద్రీకృతమైన భద్రతా దళాలను మోహరించడం జరిగింది. మొత్తం 4,000 మంది పోలీస్ సిబ్బందిని ఉత్సవాల కోసం మోహరించడం జరుగుతున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో 3,000 మంది తిరుమల కొండ పై విధుల్లో ఉండగా, మిగిలిన 1,000 మంది తిరుపతి నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









