శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- January 14, 2026
శబరిమల: శబరిమలలో అయ్యప్ప స్వామి భక్తులకు అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మికంగా ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతం అయింది. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు మాదిరిగానే బుధవారం మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యజ్యోతిని భక్తులు సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆశీర్వాద రూపంగా భావిస్తారు. ఈ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు శబరిమలకు తరలివచ్చారు.
దివ్య జ్యోతిని దర్శించుకున్న భక్తుల స్వామియే శరణమయ్యప్ప శరణుఘోషతో కొండలు మారుమోగాయి. 3838 ఎత్తుల అడుగులో వెలిగిన మకర జ్యోతి.. మూడు సార్లు భక్తులకు దర్శనం ఇచ్చింది. జనవరి 19వ తేదీన అయ్యప్ప స్వామి మూలవిరాట్ కి ఆభరణాలతో అలంకరించి దర్శనం కల్పిస్తారు. 20న స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం మూసివేస్తారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









