పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- September 25, 2025
న్యూ ఢిల్లీ: దీపావళి వేళ, ఫోన్పే వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పథకం తిరిగి ప్రవేశపెట్టబడింది. ఈ బీమా కేవలం రూ. 11 ప్రీమియంతో కొనుగోలు చేయవచ్చు మరియు అత్యధికంగా రూ. 25,000 వరకు ప్రమాద కవరేజ్ అందిస్తుంది. పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. పండగ వేడుకలలో బాణసంచా ప్రమాదాల కారణంగా 24 గంటలకుపైగా ఆసుపత్రిలో చేరడం, డే-కేర్ చికిత్స లేదా ప్రమాదవశాత్తు మరణం వంటి పరిస్థితులను ఈ బీమా కవర్ చేస్తుంది. కుటుంబం మొత్తం ఒకే పాలసీ కింద రక్షణ పొందగలదు, ఇది ప్రధానంగా ప్రత్యేకత.
ఈ పాలసీ కొనుగోలు చేసిన నాటి నుంచి 11 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12 లేదా అంతకంటే ముందు పాలసీ తీసుకున్నవారికి ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొనుగోలు చేసినవారికి వారి కొన్న తేదీ నుండి 11 రోజుల పాటు రక్షణ లభిస్తుంది. Diwali వినియోగదారులు PhonePe యాప్లోని ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లి ‘ఫైర్క్రాకర్ఇ న్సూరెన్స్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా, వివరాలు నమోదు చేసి, రూ. 11 చెల్లించడం ద్వారా ఈ పాలసీని సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









