పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- September 25, 2025
న్యూ ఢిల్లీ: దీపావళి వేళ, ఫోన్పే వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పథకం తిరిగి ప్రవేశపెట్టబడింది. ఈ బీమా కేవలం రూ. 11 ప్రీమియంతో కొనుగోలు చేయవచ్చు మరియు అత్యధికంగా రూ. 25,000 వరకు ప్రమాద కవరేజ్ అందిస్తుంది. పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. పండగ వేడుకలలో బాణసంచా ప్రమాదాల కారణంగా 24 గంటలకుపైగా ఆసుపత్రిలో చేరడం, డే-కేర్ చికిత్స లేదా ప్రమాదవశాత్తు మరణం వంటి పరిస్థితులను ఈ బీమా కవర్ చేస్తుంది. కుటుంబం మొత్తం ఒకే పాలసీ కింద రక్షణ పొందగలదు, ఇది ప్రధానంగా ప్రత్యేకత.
ఈ పాలసీ కొనుగోలు చేసిన నాటి నుంచి 11 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12 లేదా అంతకంటే ముందు పాలసీ తీసుకున్నవారికి ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొనుగోలు చేసినవారికి వారి కొన్న తేదీ నుండి 11 రోజుల పాటు రక్షణ లభిస్తుంది. Diwali వినియోగదారులు PhonePe యాప్లోని ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లి ‘ఫైర్క్రాకర్ఇ న్సూరెన్స్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా, వివరాలు నమోదు చేసి, రూ. 11 చెల్లించడం ద్వారా ఈ పాలసీని సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







