పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే
- September 25, 2025
న్యూ ఢిల్లీ: దీపావళి వేళ, ఫోన్పే వినియోగదారుల కోసం ప్రత్యేక బీమా పథకం తిరిగి ప్రవేశపెట్టబడింది. ఈ బీమా కేవలం రూ. 11 ప్రీమియంతో కొనుగోలు చేయవచ్చు మరియు అత్యధికంగా రూ. 25,000 వరకు ప్రమాద కవరేజ్ అందిస్తుంది. పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామి మరియు ఇద్దరు పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. పండగ వేడుకలలో బాణసంచా ప్రమాదాల కారణంగా 24 గంటలకుపైగా ఆసుపత్రిలో చేరడం, డే-కేర్ చికిత్స లేదా ప్రమాదవశాత్తు మరణం వంటి పరిస్థితులను ఈ బీమా కవర్ చేస్తుంది. కుటుంబం మొత్తం ఒకే పాలసీ కింద రక్షణ పొందగలదు, ఇది ప్రధానంగా ప్రత్యేకత.
ఈ పాలసీ కొనుగోలు చేసిన నాటి నుంచి 11 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. అక్టోబర్ 12 లేదా అంతకంటే ముందు పాలసీ తీసుకున్నవారికి ఆ రోజు నుంచే కవరేజీ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కొనుగోలు చేసినవారికి వారి కొన్న తేదీ నుండి 11 రోజుల పాటు రక్షణ లభిస్తుంది. Diwali వినియోగదారులు PhonePe యాప్లోని ‘ఇన్సూరెన్స్’ విభాగానికి వెళ్లి ‘ఫైర్క్రాకర్ఇ న్సూరెన్స్’ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా, వివరాలు నమోదు చేసి, రూ. 11 చెల్లించడం ద్వారా ఈ పాలసీని సులభంగా కొనుగోలు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







