మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- September 25, 2025
భారత వాయుసేనలో మరో కీలక మలుపు రానుంది. దశాబ్దాలుగా సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ, వాటి స్థానంలో దేశీయంగా రూపుదిద్దుకున్న తేజస్ జెట్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ నిర్ణయం దేశ భద్రతా వ్యవస్థలోనే కాకుండా, భారత రక్షణ పరిశ్రమలో కూడా కొత్త దిశ చూపనుంది.రక్షణ శాఖ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) (HAL)తో రూ. 62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం మొత్తం 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను భారత వాయుసేనలో చేర్చనున్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే ఈ ఒప్పందం ఖరారైనది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బలమైన పునాది వేసిన మిగ్-21 విమానాలు, పదుల ఏళ్లుగా సేవలందించాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం మార్పులు, భవిష్యత్ సవాళ్లు దృష్టిలో పెట్టుకుని వాటిని విరమింపజేస్తున్నారు. వాటి స్థానాన్ని ఇప్పుడు ఆధునిక తేజస్ యుద్ధ విమానాలు దక్కించుకోనున్నాయి.రక్షణ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందంలో 97 విమానాల్లో 68 యుద్ధ జెట్లు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు ఉంటాయి. వీటిలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థ, కంట్రోల్ యాక్యుయేటర్లు వంటి ఆధునిక సాంకేతికతలను అమర్చారు. ముఖ్యంగా 64 శాతం దేశీయ కంటెంట్, 67 స్థానిక ఉత్పత్తులు ఈ జెట్లలో వినియోగించబడ్డాయి. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి పెద్ద మద్దతు అందిస్తోంది.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







