మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- September 25, 2025
భారత వాయుసేనలో మరో కీలక మలుపు రానుంది. దశాబ్దాలుగా సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ, వాటి స్థానంలో దేశీయంగా రూపుదిద్దుకున్న తేజస్ జెట్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ నిర్ణయం దేశ భద్రతా వ్యవస్థలోనే కాకుండా, భారత రక్షణ పరిశ్రమలో కూడా కొత్త దిశ చూపనుంది.రక్షణ శాఖ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) (HAL)తో రూ. 62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం మొత్తం 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను భారత వాయుసేనలో చేర్చనున్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే ఈ ఒప్పందం ఖరారైనది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బలమైన పునాది వేసిన మిగ్-21 విమానాలు, పదుల ఏళ్లుగా సేవలందించాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం మార్పులు, భవిష్యత్ సవాళ్లు దృష్టిలో పెట్టుకుని వాటిని విరమింపజేస్తున్నారు. వాటి స్థానాన్ని ఇప్పుడు ఆధునిక తేజస్ యుద్ధ విమానాలు దక్కించుకోనున్నాయి.రక్షణ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందంలో 97 విమానాల్లో 68 యుద్ధ జెట్లు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు ఉంటాయి. వీటిలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థ, కంట్రోల్ యాక్యుయేటర్లు వంటి ఆధునిక సాంకేతికతలను అమర్చారు. ముఖ్యంగా 64 శాతం దేశీయ కంటెంట్, 67 స్థానిక ఉత్పత్తులు ఈ జెట్లలో వినియోగించబడ్డాయి. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి పెద్ద మద్దతు అందిస్తోంది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







