మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- September 25, 2025
భారత వాయుసేనలో మరో కీలక మలుపు రానుంది. దశాబ్దాలుగా సేవలందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతూ, వాటి స్థానంలో దేశీయంగా రూపుదిద్దుకున్న తేజస్ జెట్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ నిర్ణయం దేశ భద్రతా వ్యవస్థలోనే కాకుండా, భారత రక్షణ పరిశ్రమలో కూడా కొత్త దిశ చూపనుంది.రక్షణ శాఖ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) (HAL)తో రూ. 62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ ప్రకారం మొత్తం 97 తేజస్ ఎంకే-1ఏ యుద్ధ విమానాలను భారత వాయుసేనలో చేర్చనున్నారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన వెంటనే ఈ ఒప్పందం ఖరారైనది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి బలమైన పునాది వేసిన మిగ్-21 విమానాలు, పదుల ఏళ్లుగా సేవలందించాయి. కానీ సాంకేతిక పరిజ్ఞానం మార్పులు, భవిష్యత్ సవాళ్లు దృష్టిలో పెట్టుకుని వాటిని విరమింపజేస్తున్నారు. వాటి స్థానాన్ని ఇప్పుడు ఆధునిక తేజస్ యుద్ధ విమానాలు దక్కించుకోనున్నాయి.రక్షణ శాఖ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందంలో 97 విమానాల్లో 68 యుద్ధ జెట్లు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు ఉంటాయి. వీటిలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థ, కంట్రోల్ యాక్యుయేటర్లు వంటి ఆధునిక సాంకేతికతలను అమర్చారు. ముఖ్యంగా 64 శాతం దేశీయ కంటెంట్, 67 స్థానిక ఉత్పత్తులు ఈ జెట్లలో వినియోగించబడ్డాయి. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి పెద్ద మద్దతు అందిస్తోంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







