విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- October 01, 2025
మస్కట్: ఇండియాకు ప్రయాణించే విదేశీ పౌరులు ఇ-అరైవల్ కార్డును పూర్తి చేయాలని భారత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ విధానాలను వేగవంతం చేయడానికి , అంతర్జాతీయ విజిటర్స్ కు సులువైన ఎంట్రీ ప్రక్రియను నిర్ధారించడానికి డిజిటల్ ఎంట్రీ ఫారమ్ రూపొందించినట్లు తెలిపింది.
అంతర్జాతీయ విజిటర్స్ రాకపోకలకు ఆలస్యం కాకుండా ఉండటానికి బయలుదేరే 72 గంటల ముందు ఆన్లైన్ ఫారమ్ను పూరించాలని కోరారు. పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు మరియు ఇతర అంతర్జాతీయ అతిథులతో సహా భారతీయేతర పౌరులకు వర్తిస్తుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మస్కట్ మరియు అనేక భారతీయ నగరాల మధ్య విమానాలను నడుపుతున్న ఒమన్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ-అరైవల్ కార్డును ముందుగానే పూర్తి చేయడం వల్ల ఇబ్బంది లేని ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపింది. ఈ-అరైవల్ కార్డ్ ద్వారా అవసరమైన ప్రయాణ మరియు ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్గా సేకరిస్తుందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రయాణానికి ముందు అదనపు సమాచారం కోసం ఎయిర్ లైన్ సిబ్బందని సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







