విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- October 01, 2025
మస్కట్: ఇండియాకు ప్రయాణించే విదేశీ పౌరులు ఇ-అరైవల్ కార్డును పూర్తి చేయాలని భారత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ విధానాలను వేగవంతం చేయడానికి , అంతర్జాతీయ విజిటర్స్ కు సులువైన ఎంట్రీ ప్రక్రియను నిర్ధారించడానికి డిజిటల్ ఎంట్రీ ఫారమ్ రూపొందించినట్లు తెలిపింది.
అంతర్జాతీయ విజిటర్స్ రాకపోకలకు ఆలస్యం కాకుండా ఉండటానికి బయలుదేరే 72 గంటల ముందు ఆన్లైన్ ఫారమ్ను పూరించాలని కోరారు. పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు మరియు ఇతర అంతర్జాతీయ అతిథులతో సహా భారతీయేతర పౌరులకు వర్తిస్తుందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో మస్కట్ మరియు అనేక భారతీయ నగరాల మధ్య విమానాలను నడుపుతున్న ఒమన్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ-అరైవల్ కార్డును ముందుగానే పూర్తి చేయడం వల్ల ఇబ్బంది లేని ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపింది. ఈ-అరైవల్ కార్డ్ ద్వారా అవసరమైన ప్రయాణ మరియు ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్గా సేకరిస్తుందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రయాణానికి ముందు అదనపు సమాచారం కోసం ఎయిర్ లైన్ సిబ్బందని సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









