విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!

- October 01, 2025 , by Maagulf
విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!

మస్కట్: ఇండియాకు ప్రయాణించే విదేశీ పౌరులు ఇ-అరైవల్ కార్డును పూర్తి చేయాలని భారత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భారత విమానాశ్రయాలలో ఇమ్మిగ్రేషన్ విధానాలను వేగవంతం చేయడానికి , అంతర్జాతీయ విజిటర్స్ కు సులువైన ఎంట్రీ ప్రక్రియను నిర్ధారించడానికి డిజిటల్ ఎంట్రీ ఫారమ్ రూపొందించినట్లు తెలిపింది. 

అంతర్జాతీయ విజిటర్స్ రాకపోకలకు ఆలస్యం కాకుండా ఉండటానికి బయలుదేరే 72 గంటల ముందు ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలని కోరారు. పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు మరియు ఇతర అంతర్జాతీయ అతిథులతో సహా భారతీయేతర పౌరులకు వర్తిస్తుందని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో మస్కట్ మరియు అనేక భారతీయ నగరాల మధ్య విమానాలను నడుపుతున్న ఒమన్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది.  ఈ-అరైవల్ కార్డును ముందుగానే పూర్తి చేయడం వల్ల ఇబ్బంది లేని ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపింది. ఈ-అరైవల్ కార్డ్ ద్వారా అవసరమైన ప్రయాణ మరియు ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్‌గా సేకరిస్తుందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రయాణానికి ముందు అదనపు సమాచారం కోసం ఎయిర్ లైన్ సిబ్బందని సంప్రదించాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com