సీనియర్ హీరోతో రాజమౌళి సూపర్ ప్లాన్..
- October 18, 2025
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. గ్లోబ్-ట్రాటర్ అనే ట్యాగ్ లైన్ తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఆర్ఆర్ఆర్ (SSMB 29)లాంటి గ్లోబల్ సక్సెస్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం అది కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో చేయడం. దాంతో, ఆటోమేటిక్ గా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట.
అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. అలాంటి న్యూస్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, రాజమౌళి ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం టాలీవుడ్ సీనియర్ హీరోను తీసుకున్నాడట. ఆ సీనియర్ హీరో మరెవరో కాదు రాజశేఖర్. అవును, రాజశేఖర్ చాలా కాలంగా మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. విలన్ రోల్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మధ్య నితిన్ హీరోగా వచ్చిన ఎక్ట్రార్డినరీ మ్యాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
అయినప్పటికీ, మరో బంపర్ ఆఫర్ ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు-రాజమౌళి సినిమాలో ఒక విలన్ రోల్ కోసం రాజశేఖర్ ను అప్రోచ్ అవగా వెంటనే ఒకే చేశేశాడట ఆయన. ఈ పాత్రకు చాలా మంది హాలీవుడ్ నటులను అనుకున్నాడట రాజమౌళి. కానీ, ఫైనల్ గా ఆ అవకాశాన్ని రాజశేఖర్ కు ఇచ్చాడు. దీంతో, రాజశేఖర్ చాలా హ్యాపీ ఫలవుతున్నాడట. త్వరలోనే ఈ పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా మొదలుకాబోతుందట. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు “వారణాసి” అనే డివోషనల్ టైటిల్ పరిశీలనలో ఉంది. నవంబర్ లో ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
తాజా వార్తలు
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!
- పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా?
- భారత్–యూఏఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని IBPC పిలుపు
- ఒమన్ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!
- బహ్రెయిన్లో రెస్టారెంట్ మెనూల్లో క్యాలరీల వివరాలకు కొత్త విధానం..!
- ప్రపంచ శాంతి సందేశంతో 135 దేశాల పర్యటన.. 600 రోజుల్లో 2.5 లక్షల కిలోమీటర్లు..!!
- దుబాయ్లో బైక్ రైడర్కు రూ.4,000 దిర్హమ్స్ జరిమానా..!!
- ఇండోనేషియాలో భారీ భూకంపం.. 47కి చేరిన మరణాలు
- గుడ్న్యూస్.. ఖతార్ నుంచి భారత్కు మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ప్రారంభం..!!







