'అప్పట్లో ఒకడుండేవాడు' ఫస్ట్ లూక్

- July 24, 2016 , by Maagulf

నారారోహిత్‌, శ్రీవిష్ణు కథానాయకులుగా రోహిత్‌ సమర్పణలో ఆరన్‌ మీడియా వర్క్స్‌ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'అప్పట్లో ఒకడుండేవాడు'. సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. సోమవారం నారారోహిత్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఫస్ట్‌లుక్‌ విడుదల చేసింది. తానియా హోప్‌, బ్రహ్మాజి, ప్రభాస్‌ శ్రీను, అజయ్‌, శ్రీనివాసరెడ్డి, రాజీవ్‌ కనకాల, సత్యదేవ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రధారులు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో ఆడియో విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com