జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం
- July 24, 2016
జర్మనీలో మరోసారి ఉగ్రదాడి కలకలం సృష్టించింది. బెర్లిన్ లో సిరియా శరణార్థి ఒకరు బాంబు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన వ్యక్తి(27) మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ బార్ ప్రాంగణంలో జరుగుతున్న పాప్ మ్యూజిక్ ఫెస్టివల్ ను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై మ్యూజిక్ ఫెస్టివల్ లో పాల్గొన్న 2,500 మందిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.దక్షిణ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన మూడో దాడి ఇది. ఈ దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందని జర్మనీ అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిథి మైఖెల్ సిఫెనర్ వెల్లడించారు. మ్యూనిక్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందగా.. రైలులో ప్రయాణికులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడిచేసిన ఘటనలో పలువురు గాయపడిన ఘటనలు ఇటీవల జర్మనీలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







