'కబాలి' తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లు..

- July 24, 2016 , by Maagulf
'కబాలి' తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లు..

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చిత్రం 'కబాలి' ఈ నెల 22వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. పా.రంజిత్‌ దర్శకత్వంలోని ఈ సినిమాలో రాధిక ఆప్టే కథానాయికగా నటించారు. కలైపులి థాణు నిర్మాత. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు దేశంలో ఏకంగా రూ.250 కోట్ల వరకు కలెక్షన్లు సొంతం చేసుకున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. తమిళనాడులో మాత్రమే రూ.100 కోట్లు; దేశంలోని ఇతర రాష్ట్రాల్లో రూ.150 కోట్ల వరకు వసూలయ్యాయని పేర్కొన్నాయి. మరోవైపు ఈ విషయాన్ని నిర్మాత థాణు ప్రకటించినట్లు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వార్తలు కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. విదేశాల్లో రూ.వంద కోట్ల వరకు కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. గతంలో అజిత్‌ హీరోగా వచ్చిన 'వేదాలం', విజయ్‌ నటించిన 'కత్తి' రికార్డులను కూడా ఈ సినిమా తిరగరాసిందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com