శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- November 24, 2025
శ్రీశైలం: శ్రీశైలంలోని వసతి సౌకర్యాలను ఆన్లైన్లో బుక్ చేస్తామంటూ కొంతమంది మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి భక్తులను బలికొడుతున్నారు. AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో కనిపించే ఈ ఫేక్ సైట్ల ద్వారా ఇప్పటికే పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు.
తాజా ఘటనలో ఓ భక్తుడు దాదాపు ₹30,000 చెల్లించి రూములు బుక్ చేసుకున్నారు. ఆలయానికి వెళ్లి రశీదు చూపించగా, అది అసలైనది కాదని సిబ్బంది స్పష్టంచేయడంతో అతను షాక్కు గురయ్యాడు. ఇలాంటి మోసాలు మరికొందరిపై కూడా జరిగినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడానికి చర్యలు చేపట్టామని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అధికారిక వెబ్సైట్ కాకుండా ఏ ఇతర లింక్లు, పేజీలు ద్వారా బుకింగ్లు చేయవద్దని భక్తులకు సూచించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









