శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- November 24, 2025
శ్రీశైలం: శ్రీశైలంలోని వసతి సౌకర్యాలను ఆన్లైన్లో బుక్ చేస్తామంటూ కొంతమంది మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు రూపొందించి భక్తులను బలికొడుతున్నారు. AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో కనిపించే ఈ ఫేక్ సైట్ల ద్వారా ఇప్పటికే పలువురు డబ్బులు పోగొట్టుకున్నారు.
తాజా ఘటనలో ఓ భక్తుడు దాదాపు ₹30,000 చెల్లించి రూములు బుక్ చేసుకున్నారు. ఆలయానికి వెళ్లి రశీదు చూపించగా, అది అసలైనది కాదని సిబ్బంది స్పష్టంచేయడంతో అతను షాక్కు గురయ్యాడు. ఇలాంటి మోసాలు మరికొందరిపై కూడా జరిగినట్లు తెలిసింది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడానికి చర్యలు చేపట్టామని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. అధికారిక వెబ్సైట్ కాకుండా ఏ ఇతర లింక్లు, పేజీలు ద్వారా బుకింగ్లు చేయవద్దని భక్తులకు సూచించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







