ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?

- March 17, 2026 , by Maagulf
ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?

ఈద్ మరియు శుక్రవారం (జుమ్మా) ఒకే రోజున వస్తే ఏ ప్రార్థన చేయాలనే విషయంలో ప్రజల నుండి వచ్చిన సందేహాలకు యూఏఈ ఫత్వా కౌన్సిల్ స్పష్టతనిచ్చింది. కౌన్సిల్ ప్రకారం, ఈద్ మరియు జుమ్మా రెండూ వేర్వేరు ప్రాముఖ్యత కలిగిన ప్రార్థనలు కాబట్టి, ఆ రెండింటినీ వాటి నిర్ణీత సమయాల్లో విడివిడిగా నిర్వర్తించాల్సి ఉంటుంది.

తప్పనిసరి ప్రార్థన: ఇస్లాంలో శుక్రవారం ప్రార్థన (జుమ్మా) అనేది అత్యంత ముఖ్యమైన నిర్బంధ కృత్యాలలో ఒకటి. ఈద్ ప్రార్థన చేసినంత మాత్రాన జుమ్మా ప్రార్థన చేయాల్సిన బాధ్యత తొలగిపోదని కౌన్సిల్ స్పష్టం చేసింది.

ముహమ్మద్ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో ఈద్ మరియు శుక్రవారం ఒకే రోజు వచ్చినప్పుడు, వారు రెండు ప్రార్థనలను నిర్వహించారని, జుమ్మా ప్రార్థనను వదిలిపెట్టలేదని చారిత్రక ఆధారాలు ఉన్నాయని కౌన్సిల్ గుర్తు చేసింది.

ఒకవేళ ఎవరైనా ఈద్ ప్రార్థన చేసిన తర్వాత జుమ్మాకు హాజరు కాలేకపోతే, వారు ఇంట్లోనే 'జోహర్' (Dhuhr) ప్రార్థన చేసుకోవచ్చని కొందరు పండితుల అభిప్రాయం ఉన్నప్పటికీ, జుమ్మా ప్రార్థనకే ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమమని కౌన్సిల్ సూచించింది.

యూఏఈ అంతటా ఉన్న మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు యధావిధిగా నిర్వహించబడతాయి.

రంజాన్ చివరి రోజుల్లో భక్తిశ్రద్ధలతో గడపాలని, ఈద్ పండుగను కుటుంబ బంధాలను బలపరుచుకోవడానికి, అనాధలు మరియు పేదలకు సహాయం చేయడానికి ఒక అవకాశంగా మలుచుకోవాలని కౌన్సిల్ కోరింది. దేశం యొక్క భద్రత, స్థిరత్వం మరియు శ్రేయస్సు కోసం ప్రార్థిస్తూ కౌన్సిల్ తన ప్రకటనను ముగించింది.

--బాజీ షేక్(యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com