మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సభార్ధి నేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరిని NHAI చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రహదారి అభివృద్ధి అంశాలపై వివరంగా చర్చించారు.
ఈ భేటీ పార్లమెంట్ హాల్లోని CoSL చైర్మన్ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా బాలశౌరి తమ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టులను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా:
- మచిలీపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించే పనులు
- గుడివాడ–కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్ట్
- పెడన–లక్ష్మీపురం రహదారి పనులు
- అలాగే ఇతర అభివృద్ధి పనులు
ఈ వివరాల పై సంతోష్కుమార్ యాదవ్ సానుకూల స్పందన చూపిస్తూ, వెంటనే సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలనే దిశగా వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







