మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీలో సభార్ధి నేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ వల్లభనేని బాలశౌరిని NHAI చైర్మన్ సంతోష్కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని రహదారి అభివృద్ధి అంశాలపై వివరంగా చర్చించారు.
ఈ భేటీ పార్లమెంట్ హాల్లోని CoSL చైర్మన్ కార్యాలయంలో జరిగింది.ఈ సందర్భంగా బాలశౌరి తమ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక రహదారి ప్రాజెక్టులను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా:
- మచిలీపట్నం పోర్టుకు అనుసంధాన రహదారుల నిర్మాణం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి (NH-65) ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించే పనులు
- గుడివాడ–కంకిపాడు గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్ట్
- పెడన–లక్ష్మీపురం రహదారి పనులు
- అలాగే ఇతర అభివృద్ధి పనులు
ఈ వివరాల పై సంతోష్కుమార్ యాదవ్ సానుకూల స్పందన చూపిస్తూ, వెంటనే సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలనే దిశగా వెంటనే ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









