వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- December 07, 2025
ఖతార్లో దాదాపు రెండు దశాబ్దాలుగా నివసిస్తూ సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న విశాఖ వాసి, కమ్యూనిటీ నాయకుడు మరియు హ్యూమానిటేరియన్ వెంకప్ప భాగవతులకి గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) అత్యున్నత గౌరవంగా “ఉత్తమ సేవా పురస్కారం (Best Philanthropy Award)” ప్రకటించబడింది.
ఇటీవలి ఇండోర్, మధ్యప్రదేశ్లో జరిగిన GIO నాల్గవ అంతర్జాతీయ మహాసభలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆయనకు అందజేశారు. స్థానికంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సామాజిక సేవా రంగంలో చూపుతున్న ఆయన అంకితభావం, మానవతా విలువలు మరియు ప్రభావవంతమైన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేయబడింది.
పురస్కారం స్వీకరించిన అనంతరం తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన వెంకప్ప భాగవతుల , “ఈ అవార్డు నా వ్యక్తిగత కృషికి మాత్రమే కాకుండా, ఈ ప్రయాణంలో నా వెంట నడిచిన సహచరులు, భాగస్వాములు, మార్గదర్శకులు, మిత్రులు మరియు సమాజ సభ్యుల సమిష్టి అంకితభావానికి గుర్తింపు” అని పేర్కొన్నారు.
అలాగే, GIO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈ గౌరవం తనను మరింతగా నేర్చుకునేందుకు, ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రేరేపిస్తుందని తెలిపారు. “స్థానికంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో సమాజ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేయడంలో కొనసాగుతాను” అని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక సేవ పట్ల తన నిరంతర కృషితో ఇప్పటికే అనేక మంది హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన వెంకప్ప భాగవతుల తాజా సత్కారం, సమాజ సేవలో నూతన మైలురాయిగా నిలిచింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మా గల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









