ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు…
- December 10, 2025
సిడ్నీ 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ ప్రపంచంలోనే తొలి దేశంగా ఆస్ట్రేలియా బుధవారం నుంచి చట్టాన్ని అమలు చేసింది. ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘాలు స్వాగతించగా, ప్రధాన టెక్ సంస్థలు మరియు స్వేచ్ఛా భావ ప్రబోధకులు విమర్శించారు.
మంగళవారం అర్ధరాత్రి నుంచి TikTok, YouTube, Instagram, Facebook సహా 10 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు పిల్లల యాక్సెస్ను అడ్డుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపింది.
ప్రధాన మంత్రి ఆంథనీ అల్బనీస్ ఈ చట్టాన్ని “కుటుంబాల కోసం గర్వించదగిన రోజు”గా అభివర్ణించారు. ఆన్లైన్ ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకున్న వ్యవస్థాత్మక చర్యగా ఇది నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇది దేశ సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని తెలిపారు.
పిల్లల్ని సోషల్ మీడియా నుంచి దూరంగా (Australia social media ban) ఉంచడం వల్ల వారు క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం వంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టవచ్చని ఆయన సూచించారు. అయితే కొంతమంది పిల్లలు ఈ మార్పుకు అలవాటు పడేందుకు భయపడుతున్నట్లు తెలిపారు. మరికొందరు మాత్రం దీనిపై పెద్దగా ఆందోళన వ్యక్తం చేయలేదు.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, TikTokలోనే సుమారు రెండు లక్షల అకౌంట్లు ఇప్పటికే డీయాక్టివేట్ చేయబడ్డాయి. ఈ చట్టం వల్ల సుమారు 10 లక్షల మంది పిల్లలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం ఈ నిషేధం పూర్తిగా పరిపూర్ణంగా పనిచేయకపోయినా, పిల్లల మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియా కలిగించే దుష్ప్రభావాలను తగ్గించడమే లక్ష్యమని పేర్కొంది. ఈ ఆస్ట్రేలియా నిర్ణయాన్ని డెన్మార్క్, న్యూజిలాండ్, మలేషియా వంటి దేశాలు కూడా పరిశీలిస్తున్నాయి.
తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









