వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- February 07, 2026
ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్కు షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత ఈశాన్ కిషన్ (20) కొంత పోరాడినా, తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) త్వరగా పెవిలియన్ చేరారు. పవర్ప్లే ముగిసే సరికి భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను చక్కగా నిలబెట్టాడు. 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి భారత్ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అమెరికా బౌలర్లలో షెడ్లీ వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కుదిపేశాడు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







