వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- February 07, 2026
ముంబై: టీ20 వరల్డ్ కప్ 2026లో అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధశతకంతో జట్టును ఆదుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.
ఇన్నింగ్స్ ప్రారంభంలోనే భారత్కు షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత ఈశాన్ కిషన్ (20) కొంత పోరాడినా, తిలక్ వర్మ (25), శివమ్ దూబే (0) త్వరగా పెవిలియన్ చేరారు. పవర్ప్లే ముగిసే సరికి భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ను చక్కగా నిలబెట్టాడు. 49 బంతుల్లో అజేయంగా 84 పరుగులు చేసి భారత్ను గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అమెరికా బౌలర్లలో షెడ్లీ వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను కుదిపేశాడు.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









