రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- February 07, 2026
రియాద్: సౌదీ అరేబియా రైల్వేలు (SAR) 2025లో పలు రికార్డులను నమోదు చేశాయి. 14 మిలియన్లకు పైగా ప్రయాణికులు రైల్వే సేవలను పొందారు. దీంతో 2023లో నమోదైన 11.2 మిలియన్ల ప్రయాణీకుల రికార్డును బద్దలు కొట్టింది. 2023లో సుమారు 24 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయగా, ప్రస్తుతం 30 మిలియన్ టన్నులకు పైగా సరుకులను రవాణా చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది.
రైల్వే ద్వారా 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రెండు మిలియన్ల ట్రక్కుల రాకపోకలను, 139 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేసినట్టు అయిందని అధికారులు తెలిపారు. అలాగే, 364,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రైల్వే భాగస్వామ్యం అయిందన్నారు.
అదే విధంగా, సౌదీ అరేబియా అంతర్జాతీయంగా రైల్వే పలు అవార్డులను సాధించింది. సుదూర పర్యాటక రైళ్లకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) అందించే అవార్డును గెలుచుకున్న మొదటి కంపెనీగా సౌదీ రైల్వే నిలిచింది.
తాజా వార్తలు
- రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కళ్యాణం
- వన్యప్రాణుల సంరక్షణలో భారత్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ గా గద్వాల విజయలక్ష్మి
- హైదరాబాద్లో జూలై 15–16 తేదీల్లో DM–CX–Loyalty Summit 2026
- అల్ వాబ్ ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్య సేవలు ప్రారంభం..!!
- పారిశ్రామిక సంబంధాల బలోపేతంపై సౌదీ, జోర్డాన్ చర్చలు..!!
- అబుదాబి అత్యవసర వాహనాలపై స్మార్ట్ కెమెరాలు..!!
- 'ఐ లవ్ బహ్రెయిన్' ఫోటోగ్రఫీ కాంపిటీషన్..!!
- కువైట్ లో మనీలాండరింగ్ కేసు..నిందితుడిని అప్పగించిన యూఏఈ..!!
- ఈద్ హబ్తా మార్కెట్ కోసం కొత్త నిబంధనలు జారీ..!!









