రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- February 07, 2026
రియాద్: సౌదీ అరేబియా రైల్వేలు (SAR) 2025లో పలు రికార్డులను నమోదు చేశాయి. 14 మిలియన్లకు పైగా ప్రయాణికులు రైల్వే సేవలను పొందారు. దీంతో 2023లో నమోదైన 11.2 మిలియన్ల ప్రయాణీకుల రికార్డును బద్దలు కొట్టింది. 2023లో సుమారు 24 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయగా, ప్రస్తుతం 30 మిలియన్ టన్నులకు పైగా సరుకులను రవాణా చేసి కొత్త రికార్డులను నమోదు చేసింది.
రైల్వే ద్వారా 30 మిలియన్ టన్నుల సరుకులను రవాణా చేయడం ద్వారా రెండు మిలియన్ల ట్రక్కుల రాకపోకలను, 139 మిలియన్ లీటర్ల ఇంధనాన్ని ఆదా చేసినట్టు అయిందని అధికారులు తెలిపారు. అలాగే, 364,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో రైల్వే భాగస్వామ్యం అయిందన్నారు.
అదే విధంగా, సౌదీ అరేబియా అంతర్జాతీయంగా రైల్వే పలు అవార్డులను సాధించింది. సుదూర పర్యాటక రైళ్లకు ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్ (UIC) అందించే అవార్డును గెలుచుకున్న మొదటి కంపెనీగా సౌదీ రైల్వే నిలిచింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









