కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- December 12, 2025
విశాఖపట్నం: విశాఖలో నెలకొల్పుతున్న తమ సంస్థలో 25వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని IT సంస్థ కాగ్నిజెంట్ CEO రవికుమార్ వెల్లడించారు. సంస్థ భవనాలకు CM CBN శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో CEO మాట్లాడారు..ముందుగా 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్ ఇప్పుడు మరింతగా విస్తరించాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు సమక్షంలో ఉద్యోగాలు 25 వేలు కల్పిస్తామని సీఈఓ రవికుమార్ ప్రకటించారు.
విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ(AP) క్యాంపస్ లో పని చేయడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి ఇటీవల కాగ్నిజెంట్ ఆసక్తి వ్యక్తీకరణ కోరింది. నాలుగున్నర వేల మంది ఉద్యోగులు తాము వెంటనే విశాఖకు షిఫ్ట్ అవుతామని చెప్పారు.ప్రస్తుతం శంకుస్థాపన చేసిన క్యాంపస్ 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అప్పటి అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగిస్తుంది. విశాఖ క్యాంపస్లో ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి పెడుతుంది.
తాజా వార్తలు
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!









