మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- December 13, 2025
మచిలీపట్నం: ఉర్సు పండుగకు అజ్మీర్ వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం మచిలీపట్నం నుంచి అజ్మీర్ వరకు ప్రత్యేక రైలును నడపనున్నట్టు మచిలీపట్నం లోక్సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు.
మైనారిటీల తీర్థయాత్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును నడపడం ద్వారా భక్తులకు సులభమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ నిర్ణయ లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు.
రైలు వివరాలు:
రైలు నం. 07274 మచిలీపట్నం నుండి డిసెంబర్ 21 ఉదయం 10 గంటలకు బయలుదేరి, డిసెంబర్ 23 సాయంత్రం 3:30 గంటలకు అజ్మీర్ చేరుతుంది.
అజ్మీర్ ఉర్సు ఉత్సవాలు డిసెంబర్ 24, 25, 26, 27 తేదీల్లో జరుగుతాయి.
తిరుగు ప్రయాణానికి రైలు నం. 07275 అజ్మీర్ నుంచి డిసెంబర్ 28 ఉదయం 8:25 గంటలకు బయలుదేరి, డిసెంబర్ 30 ఉదయం 9:30 గంటలకు మచిలీపట్నం చేరుతుంది.
అజ్మీర్ ఉర్సు మహోత్సవానికి వెళ్లే ముస్లిం సోదరులు ఈ ప్రత్యేక రైలును సద్వినియోగం చేసుకోవాలని బాలశౌరి అన్నారు.
ఈ ప్రత్యేక రైలుకు అనుమతి మంజూరు చేసిన సికింద్రాబాద్ సదరన్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్కు, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే
- బహ్రెయిన్లో రాత్రి 9 గంటల తర్వాత నిర్మాణ పనులకు బ్రేక్..పెరుగుతున్న డిమాండ్లు..!!
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..







