ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- December 17, 2025
యాపిల్ భారత్లో మరో కీలక మైలురాయిని నమోదు చేసింది. గత నవంబర్ నెలలో భారత్ నుంచి సుమారు $2 బిలియన్ల విలువైన ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి అయినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇది దేశంలో మొత్తం స్మార్ట్ఫోన్ ఎగుమతుల్లో దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉండటం గమనార్హం. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం కింద యాపిల్ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్లకు చేరుతున్న విధానం ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. ముఖ్యంగా యూరప్, అమెరికా వంటి కీలక మార్కెట్లకు భారత్ తయారీ ఐఫోన్లు ఎగుమతి అవుతున్నాయి.
2025–26 ఆర్థిక సంవత్సరంలో ఐఫోన్ ఎగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఎనిమిది నెలల వ్యవధిలోనే ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ $14 బిలియన్లను దాటినట్లు సమాచారం. గత సంవత్సరాలతో పోలిస్తే ఇది గణనీయమైన పురోగతిగా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ యాపిల్కు కీలక తయారీ కేంద్రంగా మారుతున్న నేపథ్యంలో, రాబోయే నెలల్లో ఈ సంఖ్యలు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దేశవ్యాప్తంగా ఐఫోన్ తయారీ యూనిట్లు పెరగడం ఎగుమతుల వృద్ధికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కొత్త తయారీ కేంద్రాలు, అసెంబ్లీ యూనిట్లు ఏర్పాటవడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఫలితంగా, FY25లో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు నమోదైన స్మార్ట్ఫోన్ ఎగుమతులతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 43 శాతం వృద్ధి నమోదైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామం భారత్ను గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్గా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







