40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- December 18, 2025
అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించేందుకు ఆయన లోక్ భవన్కు వెళ్లనున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్తో పాటు కేవలం 40 మంది వైసీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తాడేపల్లి నివాసం నుంచి విజయవాడకు బయల్దేరిన జగన్, ముందుగా బందర్ రోడ్డులోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన లోక్ భవన్కు చేరుకుంటారు. పోలీసు నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో నేతలే ఆయన వెంట వెళ్లనుండగా, గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే కోటి సంతకాల ఉద్యమం ప్రధాన లక్ష్యమని వైసీపీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!
- ఫ్రెండ్ షిప్ కథను తెలిపే ఇండియన్ మానుమెంట్..!!







