40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- December 18, 2025
అమరావతి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ఉద్యమం కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పించేందుకు ఆయన లోక్ భవన్కు వెళ్లనున్నారు. అయితే ఈ సమావేశానికి జగన్తో పాటు కేవలం 40 మంది వైసీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తాడేపల్లి నివాసం నుంచి విజయవాడకు బయల్దేరిన జగన్, ముందుగా బందర్ రోడ్డులోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన లోక్ భవన్కు చేరుకుంటారు. పోలీసు నిబంధనల ప్రకారం పరిమిత సంఖ్యలో నేతలే ఆయన వెంట వెళ్లనుండగా, గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడమే కోటి సంతకాల ఉద్యమం ప్రధాన లక్ష్యమని వైసీపీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







