భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- December 19, 2025
న్యూ ఢిల్లీ: భారత ఏవియేషన్ రంగంలో పెరుగుతున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, అదానీ గ్రూప్ తమ విమానాశ్రయ వ్యాపారంలో భారీ పెట్టుబడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అదానీ ఎయిర్పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ వెల్లడించారు.
ఈ నెల 25న ప్రారంభం కానున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, రూ.19,650 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. దీనిలో అదానీ గ్రూప్ 74 శాతం వాటా కలిగి ఉంది. మొదటి దశలో ఈ విమానాశ్రయం సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. భవిష్యత్తులో సామర్థ్యాన్ని 9 కోట్ల మందికి పెంచాలని కంపెనీ భావిస్తోంది. ఇది ముంబై విమానాశ్రయంపై ఉన్న ప్రస్తుత భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషించనుంది.
జీత్ అదానీ ప్రకారం, భారత ఏవియేషన్ రంగం వచ్చే 10-15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15-16 శాతం వృద్ధి సాధించే సత్తా ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళికల్లో అదానీ గ్రూప్ దూకుడుగా పాల్గొని, 11 విమానాశ్రయాల కోసం బిడ్ చేసేందుకు సిద్దమని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి ముంబై, నవీ ముంబైతో పాటు అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహతి, జైపూర్ వంటి ఇతర 6 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం ప్రయాణికులలో దాదాపు 23 శాతం వారి ప్రయాణాలు అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్స్ ద్వారా జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







