ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- February 07, 2026
మస్కట్: ఒమన్ లో జువైనల్ నేరాలు పెరుగుతుండటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 కు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నివేదికలో నేరాల స్వభావాన్ని వివరిస్తూ.. జువైనల్ నేరాల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో దొంగతనం, బెదిరింపులు, దుర్భాషలాడడం, సైబర్ నేరాలు,హ్యాకింగ్, ఆన్లైన్ బెదిరింపులు మరియు అనుచిత కార్యకలాపాలకు ఇంటర్నెట్ను ఉపయోగించడం, ప్రమాదకరమైన డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, ట్రాఫిక్ వంటి కేసుల నమోదుపై ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో ఒమన్లో పిల్లలపై జరుగుతున్న నేరాలు మరియు వేధింపుల కేసులు పెరగడం గురించి వివరించారు.
పిల్లలను తీవ్రమైన నేరాల నుండి రక్షించడమే ప్రధాన లక్ష్యంగా చట్టాలను కఠినంగా అమలు చేయాలని సమైల్ హాస్పిటల్ అధిపతి డాక్టర్ మహమూద్ అల్ రహ్బీ తెలిపారు. పిల్లలలో విపరీత ధోరణులను త్వరగా గుర్తించడం, వారికి అవసరమైన నిరంతరం మద్దతు ఇవ్వడం ద్వారా సమస్యలను దూరం చేయవచ్చని పేర్కొన్నారు
ఒమన్లో పెరుగుతున్న పిల్లల నేరాలను పరిష్కరించడానికి, తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని బదర్ అల్ సమా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బెన్నీ పనక్కన్ సూచించారు. పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. కాగా, పిల్లలు మారడానికి అవసరమైన చొరవ ఇంట్లో నుంచే ప్రారంభం కావాలని
NMC స్పెషాలిటీ హాస్పిటల్లోని సైకియాట్రిస్టు డాక్టర్ విజయ్ నరేష్ సూచించారు. పిల్లల ప్రవర్తనపై స్కూల్, ఫ్రెండ్స్ , బయటి పరిసరాలు, కమ్యూనిటీ ముఖ్యమైన ప్రభావం చూపుతాయని తెలిపారు.
ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించడం, అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవడం ద్వారా నేరాలను నిరోధించడంలో సహాయపడుతుందని బుర్జీల్ హాస్పిటల్లోని ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, న్యాయవాదులు డాక్టర్ దిలీప్ కుమార్ సింగ్వి అన్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









