అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- December 20, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అవకాసాలపై ఆధారపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచి పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ప్రగతిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. (AP) కేంద్రం సహకారంతో నూతన హైవే ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాజాగా ఖరగ్పూర్, కటక్, విశాఖపట్నం నుంచి అమరావతికి 446 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన వెలువడింది. దీని ద్వారా రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, కలకత్తా-చెన్నై రహదారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం, అమరావతిని కీలక లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ హైవే కృష్ణ, ఏలూరు, పోలవరం, చింతపల్లి, పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాల ద్వారా వెళ్లి అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు అనుసంధానం అవుతుంది.
ఒంగోలు-కత్తిపూడి(AP) మధ్య ఉన్న జాతీయ రహదారి 16కి ప్రత్యామ్నాయంగా చీరాల ద్వారా నూతన జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే, విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకుని, వచ్చే ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులు అమరావతిని, రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన కేంద్రంగా మార్చే కీలక భాగంగా ఉంటాయి.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులు మరియు గ్రీన్ ఫీల్డ్ హైవేలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తూ, కేంద్రం అనుమతి పొందిన తర్వాత టెండర్లు ప్రారంభించనుంది.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









