అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే
- December 20, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అవకాసాలపై ఆధారపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.ముఖ్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచి పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ప్రగతిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. (AP) కేంద్రం సహకారంతో నూతన హైవే ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
తాజాగా ఖరగ్పూర్, కటక్, విశాఖపట్నం నుంచి అమరావతికి 446 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన వెలువడింది. దీని ద్వారా రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, కలకత్తా-చెన్నై రహదారికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడం, అమరావతిని కీలక లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టబడింది. ఈ హైవే కృష్ణ, ఏలూరు, పోలవరం, చింతపల్లి, పాడేరు, పార్వతీపురం, మన్యం జిల్లాల ద్వారా వెళ్లి అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కు అనుసంధానం అవుతుంది.
ఒంగోలు-కత్తిపూడి(AP) మధ్య ఉన్న జాతీయ రహదారి 16కి ప్రత్యామ్నాయంగా చీరాల ద్వారా నూతన జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అలాగే, విశాఖపట్నం-రాయపూర్ జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకుని, వచ్చే ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఈ రెండు ప్రధాన ప్రాజెక్టులు అమరావతిని, రాష్ట్ర వ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్, పారిశ్రామిక ప్రగతికి ప్రధాన కేంద్రంగా మార్చే కీలక భాగంగా ఉంటాయి.రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారులు మరియు గ్రీన్ ఫీల్డ్ హైవేలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తూ, కేంద్రం అనుమతి పొందిన తర్వాత టెండర్లు ప్రారంభించనుంది.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









