రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- December 23, 2025
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు.ముఖ్యంగా పొగమంచు కమ్ముకోవడంతో దృశ్యత తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం..రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి.ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో కేవలం ఏడు డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. సుమారు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 14డిగ్రీల లోపు కొనసాగుతున్నాయి.సాధారణం కంటే 3 నుంచి నాలుగు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి వేళల్లో బయటకు రావొద్దని, ఒకవేళ వచ్చిన చలి నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చలి నుంచి శరీరాన్ని కాపాడుకోవడానికి వస్త్రధారణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. స్వెటర్ లేదా జాకెట్ ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా ఉంటుంది. ముఖ్యంగా తల, చెవుల ద్వారా శరీర ఉష్ణోగ్రత త్వరగా తగ్గిపోయే అవకాశం ఉన్నందున మఫ్లర్లు లేదా మంకీ క్యాప్లు వాడాలి. చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు ధరించడం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి శరీరం వెచ్చగా ఉంటుంది.
కొద్దిరోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.రాబోయే రోజుల్లోనూ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంటుంది.ఈ సమయంలో ప్రజలు చలి నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చలి కాలంలో దాహం తక్కువగా వేసినప్పటికీ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడానికి గోచువెచ్చని నీటిని తరచుగా తాగుతుండాలని సూచించారు. అల్లం టీం, తులసి కషాయం, వేడి సూప్లు తీసుకోవడం వల్ల గొంతు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









