పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- January 17, 2026
అమెరికా: అమెరికాలో అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) చేపడుతున్న దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలో మిన్నెసోటా రాష్ట్రంలో జరుగుతున్న ‘మెట్రో సర్జ్’ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు భారతీయ విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
జనవరి 8న రిచ్ఫీల్డ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఇద్దరు యువకులను ICE ఏజెంట్లు ఒక్కసారిగా చుట్టుముట్టి కింద పడేసి, చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. మొదట వారిని అక్రమ వలసదారులుగా అనుమానించిన అధికారులు, విచారణలో వారు చట్టబద్ధమైన విద్యార్థులని గుర్తించారు. అయినప్పటికీ గంటల తరబడి విచారించి, వారి వీసా, ఐ-20 పత్రాలను పరిశీలించినట్లు సమాచారం.
ఈ ఘటన పై మిన్నెసోటా రాష్ట్ర ప్రతినిధి మైఖేల్ హోవార్డ్ తీవ్రంగా స్పందించారు. చర్మవర్ణం, మాట్లాడే భాష ఆధారంగా విద్యార్థులను టార్గెట్ చేయడం అన్యాయమని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో అమెరికన్ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. కేవలం అనుమానంతో భారతీయ మూలాలున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జాతి వివక్షకు ఉదాహరణగా పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







