పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- January 17, 2026
అమెరికా: అమెరికాలో అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) చేపడుతున్న దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ క్రమంలో మిన్నెసోటా రాష్ట్రంలో జరుగుతున్న ‘మెట్రో సర్జ్’ ఆపరేషన్లో భాగంగా ఇద్దరు భారతీయ విద్యార్థులను అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
జనవరి 8న రిచ్ఫీల్డ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఇద్దరు యువకులను ICE ఏజెంట్లు ఒక్కసారిగా చుట్టుముట్టి కింద పడేసి, చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. మొదట వారిని అక్రమ వలసదారులుగా అనుమానించిన అధికారులు, విచారణలో వారు చట్టబద్ధమైన విద్యార్థులని గుర్తించారు. అయినప్పటికీ గంటల తరబడి విచారించి, వారి వీసా, ఐ-20 పత్రాలను పరిశీలించినట్లు సమాచారం.
ఈ ఘటన పై మిన్నెసోటా రాష్ట్ర ప్రతినిధి మైఖేల్ హోవార్డ్ తీవ్రంగా స్పందించారు. చర్మవర్ణం, మాట్లాడే భాష ఆధారంగా విద్యార్థులను టార్గెట్ చేయడం అన్యాయమని విమర్శించారు. అరెస్ట్ అయిన వారిలో అమెరికన్ పౌరసత్వం ఉన్నవారు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. కేవలం అనుమానంతో భారతీయ మూలాలున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జాతి వివక్షకు ఉదాహరణగా పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!







