75కోట్ల భారీ బడ్జెట్తో చిత్రం 'జాగ్వార్'..
- July 28, 2016
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి కుమారస్వామి తనయుడు నిఖిల్కుమార్ హీరోగా పరిచయం చేస్తూ రూ. 75కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్'. ఈ చిత్రం ఫస్ట్లుక్, టీజర్ని జులై 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ పార్క్ హయత్లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నారు. బాహుబలి, భజరంగి భాయ్జాన్ చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ అందించారు. బాలకృష్ణతో 'మిత్రుడు' తీసిన ఎ. మహదేవ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు. థమన్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామజోగయ్యశాస్త్రి ఈ చిత్రానికి పాటలు రాశారు. హెచ్.డి. కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీప్తి కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు విలక్షణమైన పాత్రను పోషిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







