ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- January 23, 2026
హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలోని దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు (NTR), అక్కినేని నాగేశ్వరరావు (ANR), శోభన్ బాబు వ్యక్తిత్వాలు హుందాతనం, సహృదయం, మర్యాదతో కూడినవని, నేటి తరానికి అవి ఆదర్శంగా నిలుస్తాయని ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు.
శ్రీ త్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో, ప్రముఖ గాయకుడు ఫణి నిర్వహణలో “స్వర నివాళి” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు నటించిన చిత్రాలలోని సూపర్ హిట్ పాటలను ఫణి, శాస్త్రి రవికుమార్, హృషికేశ్, గంటి రామకృష్ణ, శైలజ, లలిత, రాధిక తదితర గాయకులు మధురంగా ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, ముగ్గురు మహానటులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ సహృదయత, ఏఎన్ఆర్ సరదాతనం, శోభన్ బాబు హుందాతనం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవని అన్నారు. వారి వ్యక్తిత్వాలు కేవలం నటనలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ అందరికీ మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వంశీ రామరాజు మాట్లాడుతూ, ఎన్టీఆర్తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే ఏఎన్ఆర్ వంశీ సంస్థకు మేనమామ అని, శోభన్ బాబు తమ వంశీ సాంస్కృతిక సంస్థను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆ ముగ్గురు మహానటులకు సంగీత స్వరూపంలో ఘన నివాళి అర్పించామని అన్నారు.
తెలుగు సినిమా స్వర్ణయుగాన్ని స్మరింపజేసిన ఈ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







