గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- January 23, 2026
మనామా: బహ్రెయిన్ - కువైట్ మధ్య సంబంధాలు ఒక సజీవ చారిత్రక వారసత్వం అని ఉప ప్రధాన మంత్రి షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ఇది రెండు దేశాల మధ్య ఉన్న సోదరభావం మరియు సన్నిహిత సహకార అత్యున్నత విలువలను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
గల్ఫ్ సహకార మండలి (GCC) ద్వైపాక్షిక లక్ష్యాలను సాధించే విధంగా మరియు సహకారాన్ని విస్తరించడానికి వీలుగా ఉమ్మడిగా చేపట్టే ప్రయత్నాలు రెండు సోదర దేశాల మధ్య సంబంధాలు ఆదర్శ మోడల్ గా పనిచేస్తాయని ఆయన హైలైట్ చేశారు.
కువైట్ మంత్రి పర్యటన సందర్భంగా అల్-ఖుదైబియా ప్యాలెస్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు షేక్ ఖలీద్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ, కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అబ్దుల్లా అల్-యాహ్యా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంకా కువైట్లోని బహ్రెయిన్ రాయబారి సలాహ్ అలీ అల్-మాలికి, బహ్రెయిన్లోని కువైట్ అఫైర్స్ యూసఫ్ అల్-బన్నావ్ మరియు ఇరువైపుల నుండి అనేక మంది అధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









