మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- January 27, 2026
మనమా: బహ్రెయిన్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి ప్రాణాలు కోల్పోగా, మరో ప్రయాణికురాలు గాయపడినట్లు కోర్టు రికార్డులు చెబుతున్నాయి. సుమారు ఉదయం 5:34 గంటలకు నిందితుడు తన స్నేహితులతో కలిసి చట్టబద్ధమైన పరిమితి కంటే 30% అధిక వేగంతో వాహనం నడిపిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మద్యం సేవించి ఉన్న డ్రైవర్ నిర్లక్ష్యంగా లేన్ మార్చాడని, వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టాడు. అనంతరం ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని బలంగా ఢీకొట్డాడు. అందులో ప్రయాణిస్తున్న యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరోకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మొదటి హై క్రిమినల్ కోర్టు ముందు హాజరైనప్పుడు, నిందితుడు తనపై మోపబడిన అభియోగాలను అంగీకరించాడు. అతివేగంగా వాహనాన్ని నడపడం అనే నిర్దిష్ట అభియోగాన్ని తిరస్కరించాడు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఒక వ్యక్తి మరణించడం మరియు మరొక వ్యక్తి గాయపడటం, వేగ పరిమితిని మించి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనంపై నియంత్రణ కోల్పోవడం వంటి నేరాలకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిపై అభియోగం మోపింది. ప్రజా ఆస్తికి నష్టం కలిగించినందుకు కూడా అతనిపై కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 1కి కోర్టు షెడ్యూల్ చేసింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







