భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- February 02, 2026
పాకిస్తాన్: టీ20 వరల్డ్కప్ 2026 (T20 WC) లో భారత్తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.పీసీబీ నిర్ణయాన్ని విచారకరమని పేర్కొన్న అఫ్రిది.. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ, ఈ వ్యవహారంలో ఐసీసీ న్యాయంగా వ్యవహరించాలని కోరారు.
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్ – పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ను పాకిస్తాన్ ప్రభుత్వం బాయ్కాట్ చేయాలని ఆదేశించింది. బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తొలగించిన విషయంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా ఈ మ్యాచ్ను దూరం పెట్టే దిశగా అడుగులు వేస్తోంది.ఈ అంశంపై అఫ్రిది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ “రాజకీయాలు మూసే తలుపులను క్రికెట్ తెరుస్తుంది అని నేను ఎప్పుడూ నమ్ముతాను. భారత్తో మ్యాచ్ ఆడకపోవడం బాధాకరం. అయినా ప్రభుత్వ నిర్ణయానికి నేను మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడు ఐసీసీ మాటలతో కాదు, నిర్ణయాలతో న్యాయం చూపించాల్సిన సమయం ఇది” అని పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







