ట్యాక్స్ రిటర్న్స్ను ఆగస్ట్ 31 వరకు దాఖల గడువు పొడిగింపు ..
- July 29, 2016
కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు.7 లక్షల అసెసీలకు ఐటీ విభాగం లేఖలు హైదరాబాద్: పన్ను ఎగవేతలను అరికట్టే దిశగా అధిక విలువ లావాదేవీలు జరిపిన వారి పాన్ నంబరు వివరాలను సేకరించడంపై ఆదాయ పన్ను విభాగం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఈ తరహా లావాదేవీలు నిర్వహించిన 7 లక్షల మంది అసెసీలకు .. పాన్ నంబరు సమర్పించాలంటూ లేఖలు పంపనుంది. ఈ వివరాలు సమర్పించేందుకు సదరు అసెసీల సౌకర్యార్థం కొత్తగా ఈ-ఫైలింగ్ వెబ్సైట్ను కూడా ప్రవేశపెట్టినట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







