గుజరాత్‌ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక...

- August 01, 2016 , by Maagulf
గుజరాత్‌ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక...

గుజరాత్‌ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ కానుకను అందించబోతోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి గుజరాత్‌లో కార్లు, చిన్న వాహనదారులు టోల్‌ పన్నును కట్టాల్సిన అవసరం ఉండబోదట. ఈ మేరకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి కార్లు, ఆటోరిక్షాలు, చిన్నవాహనాలను టోల్‌ ట్యాక్స్‌ల నుంచి మినహాయిస్తున్నట్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ ట్వీట్‌ చేశారు. నిరంతరం టోల్‌ బూత్‌లను దాటుకుంటూ ఆఫీసులకూ, కాలేజీలకూ వెళ్లే వాహనదారులకు ట్యాక్స్‌ కట్టడం భారంగా మారుతోందని.. అందుకే మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆనందీబెన్‌ తెలిపారు. గుజరాత్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com