అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని : కేటీఆ

- August 01, 2016 , by Maagulf
అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని : కేటీఆ

 తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఈరోజు కరీంనగర్‌లోని ఇసుక రీచ్‌ల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొత్తపల్లి ఇసుక రీచ్‌తో పాటు మోయతుమ్మెద వాగులో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించారు. జిల్లాలో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ జోయల్‌ డేవిస్‌, ఆర్డీవోతో మాట్లాడి.. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మైనింగ్‌ జాతీయ సంపదని, అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం, టీఎస్‌ ఎండీసీ అధికారులకు తెలియకుండా మంత్రి ఈ పర్యటన చేయడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com