అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!

- March 14, 2026 , by Maagulf
అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!

కువైట్: పవిత్ర రామదాన్ మాసంలో జెరూసలేంలోని అల్-అక్సా మసీదును మూసి వేయడాన్ని కువైట్ మరియు మరో ఎనిమిది ఇస్లామిక్ మరియు అరబ్ దేశాలు జియోనిస్ట్ సంస్థ తీరును ఖండించాయి.ఇరాన్‌ పై అమెరికాతో వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా తూర్పు జెరూసలేం పాత నగరంలోని అన్ని పవిత్ర స్థలాలను జియోనిస్ట్ సంస్థ మూసివేసింది. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీసింది. రమదాన్ సందర్భంగా పదివేల మంది పాలస్తీనా ముస్లింలు సాధారణంగా ఇస్లాంలో మూడవ పవిత్ర స్థలం అయిన మసీదులో ప్రార్థనలు చేస్తారు.

ఆక్రమిత జెరూసలేంలోని అల్-అక్సా మసీదును మూసివేయడంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ తన నిరసనను వ్యక్తం చేసింది. ఇది పవిత్ర రమదాన్ మాసంలో ఆరాధకులను ప్రవేశించకుండా నిషేధించడం సరికాదని తెలిపింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం, ఆరాధనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మనోభావాలను స్పష్టంగా రెచ్చగొట్టడం అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది.

పాకిస్తాన్, ఈజిప్ట్, జోర్డాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, టర్కీ, సౌదీ అరేబియా మరియు ఖతార్ విదేశాంగ మంత్రులు కూడా ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించడం చట్టవిరుద్ధం మరియు అన్యాయం అని అన్నారు. ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com