ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- March 27, 2026
ఇబ్రి: అల్ ధాహిరా గవర్నరేట్లోని ఇబ్రి విలాయత్లో ఒక వాడీలో వాటర్ పూల్ లో నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మరణించినట్లు సెర్చ్ అండ్ రెస్క్యూ సెక్టార్ నివేదించింది. బాధితుల్లో ఒకరు నీటిలోకి దిగి మునగగా, రెండవ మహిళ ఆమెను రక్షించడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత ఇద్దరూ నీటి ఉధృతికి చిక్కుకుని మునిగిపోయారని అధికారులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, మృతదేహాలను వెలికితీశాయి. ఒమన్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల వాడీలు మరియు లోతట్టు ప్రాంతాలలో నీటి మడుగులు ఏర్పడి, ఇలాంటి ప్రమాదాల ముప్పు ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







