హైదరాబాద్ లో భానుడి భగభగలు
- March 29, 2026
హైదరాబాద్: హైదరాబాద్లో వేసవి సెగలు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38.2 డిగ్రీల సెల్సియస్గా నమోదవ్వగా, కనిష్ట ఉష్ణోగ్రత 24.6 డిగ్రీలుగా ఉంది. ముఖ్యంగా గాలిలో తేమ శాతం కేవలం 23% కి పడిపోవడంతో వాతావరణం పొడిగా మారి, నగరవాసులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఆదివారం నాటికి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 39 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, మార్చి 30, 31 తేదీల్లో నగరంలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈ వర్షం కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుందని, ఎండల తీవ్రత మాత్రం తగ్గదని నిపుణులు చెబుతున్నారు. వర్షం తర్వాత భూమి నుంచి వచ్చే ఆవిరి వల్ల ఉక్కపోత మరింత పెరిగే ప్రమాదం ఉంది.
41 డిగ్రీల వరకు..
నిజమైన వేసవి తాపం ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలుకానుంది. వచ్చే నెల ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు 38 నుండి 41 డిగ్రీల మధ్య నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- సముద్ర రాకపోకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు: యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఇరాన్తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు నిలిపివేసిన యూఏఈ
- ఫ్లయింగ్ కారు రవికి కేంద్ర మంత్రి సపోర్ట్..!
- ఇరాన్ నుంచి యూఏఈ వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు..
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!







