యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ

- August 18, 2026 , by Maagulf
యూఎస్ అధ్యక్షుడు ట్రంప్‌తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సందర్భంగా యూఏఈ-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చించారు.

అలాగే మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతంలో కొనసాగుతున్న పరిస్థితులను పరిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.

యూఏఈ, అమెరికా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, పరస్పర ప్రయోజనాలను కాపాడే విధంగా భవిష్యత్ సహకారాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com