మారకానా స్టేడియం సమీపంలో ఇద్దరి కాల్చివేత..
- August 06, 2016
ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి ఆతిథ్యమిచ్చిన మారకానా స్టేడియం సమీపంలో శుక్రవారం ఓ దొంగను పోలీసులు కాల్చిచంపారు. మరో వేదిక దగ్గర 51 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మారకానా స్టేడియం వద్ద దోపిడీకి పాల్పడుతున్న వ్యక్తిని ఓ పోలీసు అధికారి అడ్డగించి కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు.దీనికి కొన్ని గంటల ముందు ఒలింపిక్ జ్యోతి ఉన్న ప్రాంతానికి కారులో వెళ్తున్న మహిళపై ముగ్గురు దొంగలు దాడిచేసి తుపాకులతో కాల్చి చంపారు. పోటీలు జరిగే వివిధ వేదికల్లో సుమారు 85 వేల మంది సైనికులు, పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. పురుషుల సైక్లింగ్ రేసు ముగిసే కోపాకాబానా సమీపంలో బ్రెజిల్ మిలిటరీ ఆధ్వర్యంలో ఓ బాంబును నిర్వీర్యం చేశారు. నిపుణుల సమక్షంలో దీన్ని పేల్చివే శారు. ఆ సమయంలో పోలీసులు ప్రజలను దూరంగా ఉంచారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







