దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి

- May 10, 2026 , by Maagulf
దోహా తీరంలో నౌకపై క్షిపణి దాడి

స్వల్ప అగ్ని ప్రమాదం.. ఎలాంటి ప్రాణనష్టం లేదు

దోహా: ఖతార్ తీర జలాల్లో ఓ వాణిజ్య కార్గో నౌక పై డ్రోన్ దాడి జరిగినట్లు ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం మెసాయీద్ పోర్ట్‌కు ఈశాన్య దిశలో ఉన్న ఖతార్ ప్రాదేశిక జలాల్లో చోటుచేసుకుంది.

రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, డ్రోన్ దాడి కారణంగా నౌకలో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలిపింది. అయితే వెంటనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని పేర్కొంది.

అగ్ని ప్రమాదం అనంతరం కూడా కార్గో నౌక తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మెసాయీద్ పోర్ట్ వైపు కదిలినట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది. ప్రాంతీయ సముద్ర భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com