యూఏఈ అధికారిక పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం

- May 15, 2026 , by Maagulf
యూఏఈ అధికారిక పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం

అబూదాబి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ప్రత్యేక అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్, యూఏఈ దేశాల జాతీయ గీతాలను వాయించగా, గార్డ్ ఆఫ్ హానర్‌తో మోదీకి మర్యాదలు సమర్పించారు.

ప్రధాని మోదీని తీసుకువచ్చిన విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే యూఏఈ సైనిక యుద్ధవిమానాల బృందం దానికి ఎస్కార్ట్‌గా చేరింది. స్వాగత సూచకంగా విమానాన్ని విమానాశ్రయం వరకు తీసుకెళ్లేందుకు స్క్వాడ్రన్ లీడర్ ప్రత్యేక అనుమతి కోరినట్లు అధికారులు తెలిపారు.

ఈ పర్యటనలో భారత్-యూఏఈ ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు మరియు వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com